భారత్లో స్మార్ట్ఫోన్ వినియోగం రోజురోజుకీ పెరుగుతుండడంతో ప్రపంచంలోనే రెండో అతిపెద్ద స్మార్ట్ ఫోన్ మార్కెట్గా అవతరించింది. చైనా తర్వాత ప్రపంచంలోనే రెండో అతిపెద్ద స్మార్ట్ఫోన్ మార్కెట్గా నిలిచిందని కౌంటర్పాయింట్ రీసెర్చ్ తెలిపింది. నివేదిక ప్రకారం.. 2019వ సంవత్సరం నాల్గవ త్రైమాసికంలోభారత స్మార్ట్ఫోన్ మార్కెట్లో 27శాతం మార్కెట్ షేర్తో షియోమీ మొదటి స్థానంలో నిలవగా, వివో 21 శాతం వాటాతో శాంసంగ్ను వెనక్కి నెట్టి రెండో స్థానంలో నిలిచింది. ఇక శాంసంగ్ 19 శాతం వాటాతో 3వ స్థానానికి పడిపోయింది.
అమెరికానే దాటేశాం..!